ఐసిసి టి20 పురుషుల వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియా
సిద్దిపేట నియోజకవర్గ యువ నాయకుడు వంగ రాజేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు
సిద్దిపేట నేటి కేసరి మార్చి 08
ఐసిసి టి20 పురుషుల వరల్డ్ కప్లో అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించిన టీమ్ ఇండియాకు సిద్దిపేట నియోజకవర్గ యువ నాయకులు వంగ రాజేశ్వర్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత జట్టు ప్రతి ఆటగాడు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ప్రపంచ కప్ను సాధించడం ఎంతో సంతోషం. జట్టు సమిష్టి కృషి, పట్టుదల, దేశభక్తి భావం వల్ల ఈ గొప్ప విజయాన్ని అందుకున్నారని అన్నారు.ఈ విజయం భారత క్రికెట్కు మరింత గౌరవాన్ని తీసుకురావడంతో పాటు యువతకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని యువ నాయకుడు వంగ రాజేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.భవిష్యత్తులో కూడా టీమ్ ఇండియా ఇలాంటి విజయాలు సాధించి దేశానికి మరిన్ని కప్ లు తీసుకురావాలని ఆకాంక్షించారు.

